రామకృష్ణ మఠంలో వేసవి శిబిరాలు

రామకృష్ణ మఠంలో వేసవి శిబిరాలు

హైదరాబాద్: రామకృష్ణ మఠంలో వేసవి శిక్షణ శిబిరాలకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. నాలుగో తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు వేర్వేరుగా శిబిరాలు నిర్వహిస్తున్నారు. అడ్మిషన్లు కావాలనుకునేవారు తమ చిన్నారుల స్కూల్ ఐడెంటిటీ కార్డు తీసుకొని రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ కార్యాలయానికి రావాలని అధ్యక్షుడు స్వామి బోధమయానంద చెప్పారు. ఏడో తరగతి విద్యార్థులకు ఈ నెల 28 నుంచి మే 11 వరకు అలాగే 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మే 12 నుంచి మే 25 వరకు సంస్కార్ పేరిట వేసవి శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ధ్యానము, యోగాసనాలు, నైతిక విలువలకు సంబంధించిన అంశాలపై నిపుణులతో శిక్షణ ఇస్తామన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈనెల 14 నుంచి 24 వరకు శ్రద్ధ పేరిట వ్యక్తిత్వ వికాస శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు. ధ్యానము, యోగాసనాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, నైతిక అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. మరిన్ని వివరాలకు 040_ 27627961, లేదా 9177232696 నెంబరుకు ఫోన్ చేయాలని బోధమయానంద సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *