బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా బి ఆర్ అంబేద్కర్: వెంకటేష్ , అత్తాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు
వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడిచి వారి ఆశయ సాధనకు కృషి చేద్దాం..
అంబేద్కర్ జయంతి సందర్భంగా వినమ్ర నివాళులు..
ఆర్.బి.ఎం డెస్క్: డా.బాబా సాహెబ్ అంబేద్కర్ నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత అని అత్తాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు సులిగే వెంకటేష్ పేర్కొన్నారు. లౌకిక రాజ్య స్థాపనే లక్ష్యంగా బడుగు, బలహీన వర్గాల ప్రజలకు రాజ్యాంగ బద్దంగా హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్ కే దక్కిందన్నారు. భారత జాతిని జాగృత పరిచిన ఆదర్శమూర్తి , మహోన్నత వ్యక్తి అని వెంకటేష్ అన్నారు.భారత రాజ్యాంగ నిర్మాతగా, న్యాయశాస్త్ర నిపుణుడు, ఆర్థిక వేత్త, సామాజిక శాస్త్రజ్ఞుడు, చరిత్ర కారుడు, రాజనీతి కోవిడుదుగా అంబేద్కర్ పేరు ప్రఖ్యాతులు పొందారన్నారు.మహానీయులైన జగజ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే, డా బి ఆర్ అంబేద్కర్ లు ఏప్రిల్ మాసంలో జన్మించారన్నారని ఈ సందర్భంగా అత్తాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు సులిగే వెంకటేష్ చెప్పుకొచ్చారు.