డబ్బులు ఉన్నవాళ్లే ఎన్నికల్లో పోటీ చేయండి: కొండా సురేఖ

డబ్బులు ఉన్నవాళ్లే ఎన్నికల్లో పోటీ చేయండి: కొండా సురేఖ

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ రాబోయే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సంచనల వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లు మాత్రమే టికెట్ అడగాలని ఆమె సూచించారు. ఎన్నికల్లో డబ్బులు పెట్టె స్థోమత లేనివారు టికెట్ ఆశించవద్దని అభ్యర్థులు కొంత డబ్బు ఖర్చుపెడితే పార్టీ కొంత డబ్బు ఖర్చుచేస్తుంది అని కొండా సురేఖ కాంగ్రెస్ శ్రేణులకు తెలిపారు. వచ్చే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్స్ ఎన్నికల నేపథ్యంలో హన్మకొండలోని తమ నివాసంలో కొండా సురేఖ దంపతులు ఏర్పాటు చేసిన వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యి ఈ వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. ఈ క్రమంలో అధికార పక్షం మాయమాటలకు ఎవరు కూడా అమ్ముడుపోవొద్దని తమకు గుర్తింపు హోదా తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని మోసం చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఎన్నికలు అంటే పూర్తిగా డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి అని అందువల్లనే ఆర్థికంగా ఉన్నవాళ్లే టికెట్ ఆశించాలని ఈ సందర్బంగా కొండా సురేఖ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *