కేసీఆర్ సోమరిపోతు.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..

కేసీఆర్ సోమరిపోతు.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..

ఆర్.బి.ఎం డెస్క్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ వద్ద మీడియాతో వైఎస్ షర్మిల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీరని ద్రోహం చేస్తుందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబంలో అందరికి ఉద్యోగాలు వచ్చాయి.కానీ తెలంగాణ యువతకు మాత్రం ఉద్యోగాలు రావడం లేదని ఆమె పేర్కొన్నారు. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన సిగ్గు పడాలని షర్మిల మండిపడ్డారు. ఫామ్ హౌస్ లో ఉండే కేసీఆర్ సోమరిపోతు, తెలంగాణ ప్రజలు కాదని షర్మిల అన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో 20 మంది ప్రొఫెసర్లు ఉండాలి కానీ ప్రస్తుతం ఆరుగురు ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారని ఆమె అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నారని షర్మిల విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *