ఆ మంత్రిపై పొగడ్తల వర్షం కురిపించిన గవర్నర్ దత్తాత్రేయ..
హైదరాబాద్: విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని పొగడ్తల వర్షంలో ముంచెత్తిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ. సోమవారం మంత్రి జగదీష్ రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని మంత్రితో దత్తాత్రేయ ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో జగదీష్ రెడ్డి తనదైన శైలిలో పోరాటం చేసారని అభినందించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి విద్యాశాఖ మంత్రిగా తాజాగా విద్యుత్ శాఖ మంత్రిగా తన బాధ్యతలను అంకితభావంతో చేస్తున్నారని దత్తాత్రేయ అన్నారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు చేయాలని ఆయన ఆకాంక్షించారు.