ఇచ్చిన ప్రతి హామీని ప్రజల మధ్యలో ఉండి నెరవేరుస్తా: సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

ఇచ్చిన ప్రతి హామీని ప్రజల మధ్యలో ఉండి నెరవేరుస్తా: సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

ఆర్.బి.ఎం: రెండు నెలల క్రితం ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని సంకటోనిపల్లి గ్రామంలో పర్యటించినప్పుడు నిర్మాణంలో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి నిర్మాణానికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ నేపథ్యంలోనే ఇచ్చిన హామీ మేరకు చైర్మన్ రాఘవేందర్ రెడ్డి ఈరోజు ఆలయ కమిటీ సభ్యులకు ఒక లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ముందుగా ఆయన డా. బిఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నిరంజన్ నరేష్ నరసింహ మహేష్ యాదయ్య బాలరాజు,చంద్రశేఖర్, రాజు వంశీ,యాదగిరి, జలందర్, సాయిలు, సుదీర్, సాలమ్మ, ఈరమ్మ, లక్ష్మమ్మ, మాధవి, లక్ష్మీదేవి గ్రామస్థులు ఐక్యత ఫౌండేషన్ సభ్యులు సురేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *