శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత..
శంషాబాద్: దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల కథనం మేరకు.. దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుడు శనివారం శంషాబాద్ ఎయిర్పోర్టు చేరుకున్నారు. ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు బ్యాగులను తనిఖీలు చేయగా 435గ్రాముల బంగారాన్ని గుర్తించారు. బంగారానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ.23లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.