తెరాస సీనియర్ నాయకుడు మృతి..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: మల్కాజిగిరి నియోజకవర్గం తెరాస సీనియర్ నేత హైదర్అలీ (46) సోమవారం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హైదర్అలీ మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలీబాయ్ సహృదయులు అని అయన అన్నారు. మౌలాలి కమాన్ విస్తరణలో హైదర్అలీ సహకారం మరవలేనిది అని మైనంపల్లి హన్మంతరావు గుర్తుచేశారు.హైదర్అలీ మృతి తెరాస పార్టీకి, తనకు వ్యక్తిగతంగా తీరని లోటని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. హైదర్అలీ మృతికి సంతాపం ప్రకటించిన హన్మంతరావు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేశారు.