హైదరాబాద్ లో పుట్టి పెరిగిన మా కంటే బలవంతుడు ఎవరు? :తలసాని శ్రీనివాస్ యాదవ్
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు.పరోక్షంగా రేవంత్ రెడ్డిపై శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు.మొన్న జరిగిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏక వచనంతో సంబోధించడం మంచిది కాదని తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. జైలుకు పోయే వాళ్ళ జైలు గురించి మాట్లాడడం ఏంటని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన మా కంటే ఎవరు బలవంతుడు ఉంటారని తలసాని శ్రీనివాస్ యాదవ్ పరోక్షంగా రేవంత్ రెడ్డిపై శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.మేము ఒక్కసారి మీ గురించి ఆలోచిస్తే ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటి అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీవీల్లో పేపర్లలో కనిపిస్తున్నాను కదా అని ఇష్టానుసారంగా హద్దులు మీరి విమర్శలు చేస్తే ఇక సహించం అని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే కెసిఆర్ గారి సూచనల మేరకు సైలెంట్గా ఉంటున్నామని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.