చార్మినార్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటుడు..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: నగరంలోని పురాతన ఆలయాల్లో ఒక్కటైనా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని బాలీవుడ్ నటుడు గోవింద కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు. ముంబై నుండి హైదరాబాద్ కు చేరుకున్న నటుడు గోవింద దంపతులకు చార్మినార్ ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా ఆహ్వానం పలికారు. గోవింద దంపతులకు ప్రత్యేక్య దర్శనం చేయించారు. దర్శనం అనంతరం గోవింద దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానించారు. ఈమేరకు నటుడు గోవింద మాట్లాడుతూ తనపై ఇంతగా ప్రేమాభిమానాలు చూపినందుకు కృతజ్ఞతలు తెలియజేసారు.