షర్మిల పార్టీ కీలక నేత రాజీనామా..

షర్మిల పార్టీ కీలక నేత రాజీనామా

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: వైఎస్ షర్మిల పార్టీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది.తెలంగాణలో నూతనంగా ఏర్పాటైన వైఎస్సార్ తెలంగాణ పార్టీకి కీలక నేత రాజీనామా చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇంచార్జి గా ఉన్న చేవెళ్ల ప్రతాప్ రెడ్డి ఈరోజు పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పాత్రని పార్టీ కార్యాలయానికి పంపించారు. తాను రాజీనామా చేయడానికి కారణం పార్టీకి చెందిన కీలక నేత రాఘవరెడ్డి అని అయన తెలిపారు. ప్రస్తుతం షర్మిల పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈరోజు షర్మిల నూతనంగా కమిటీలు కూడా ప్రకటించారు.ఇంతలోనే కీలక నేత పార్టీకి రాజీనామా చేయడంతో పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ను టార్గెట్ చేస్తూ షర్మిల ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయాలను ఎప్పటికి అప్పుడు ఎండగడుతూ షర్మిల ప్రజల వైపు పోరాటం చేస్తున్నారు.చేవెళ్ల ప్రతాప్ రెడ్డి రాజీనామాతో షర్మిల పార్టీలో ఆధిపత్య పోరు మొదలైందనే చర్చ ఇప్పుడు రాజకీయవర్గాల్లో జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *