హైకోర్టు సంచలన తీర్పు.. పోలీసులతో పాటు గోరక్ష దళ్‌ వ్యక్తులు కూడా..

హైకోర్టు సంచలన తీర్పు.. పోలీసులతో పాటు గోరక్ష దళ్‌ వ్యక్తులు కూడా..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు గోవుల అక్రమ తరలింపుపై సంచలన తీర్పు వెలువరించింది. గోవులకు సంబంధిచిన సరైన ధ్రువ పత్రాలు లేకుండా హైదరాబాద్ లోకి ప్రవేశించడానికి అనుమతులు లేవని హైకోర్టు తేల్చి చెప్పేసింది. ఈ క్రమంలో చెక్ పోస్ట్ ల వద్ద పోలీసులతో పాటు గో రక్షక్ దళ్ కి చెందిన ఒక వ్యక్తిని వాహనాలను తనిఖీ చేయడానికి హైకోర్ట్ అనుమతులు ఇచ్చింది. గోవులకు,వాహనాలకు సంబంధించి సరైన పత్రాలు లేకపోతే సీజ్ చేయవచ్చని హైకోర్టు తెలిపింది. గోవులను అక్రమంగా వాహనాల్లో తరలిస్తే గోరక్షక్ దళ్ వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపింది. గోరక్షకుల నుండి ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు నగరంలో అక్రమంగా గోవులను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకొని వారిపై కేసులు నమోదు చేయాలనీ హైకోర్టు తీర్పులో ఈ విధంగా పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *