కెసిఆర్ సమక్షంలో తెరాస లో చేరనున్న పాడి కౌశిక్ రెడ్డి..

కెసిఆర్ సమక్షంలో తెరాస లో చేరనున్న పాడి కౌశిక్ రెడ్డి..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: హుజురాబాద్ అభివృద్ధి చెందాలంటే అది కేవలం టీఆరెస్ తోనే సాధ్యం అని కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కౌశిక్ రెడ్డి గచ్చిబౌలిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. హుజురాబాద్ అభివృద్ధి కోసమే తెరాస లో చేరనున్నట్టు అయన తెలిపారు. హుజురాబాద్ నాయకులు,ప్రజలు,కార్యకర్తల అభిప్రాయం తీసుకున్న తరువాత నేను తెరాస చేరడానికి నిర్ణయించుకున్న అని కౌశిక్ రెడ్డి అన్నారు. తెరాస ప్రభుత్వంతో మాత్రమే అన్ని వర్గాలకు తగిన న్యాయం జరుగుతుందని కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ ప్రజలు నమ్మి ఒక్క అవకాశం ఇస్తే వచ్చే రెండేళ్లలో మంచి అభివృద్ధి చేసి చూపిస్తానని కౌశిక్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చని పక్షంలో ప్రజలను ఓట్లు అడగమని అయన తెలిపారు. తెరాస పార్టీని హుజురాబాద్ లో గెలిపిస్తే ఎస్సి ఎస్టీ బీసీ బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయని కౌశిక్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో దళిత బంధు పథకం ప్రవేశ పెట్టి ప్రతి దళితుడికి న్యాయం జరిగేలా రూపకల్పన చేశారని కౌశిక్ రెడ్డి వివరించారు.

కెసిఆర్ సమక్షంలో తెరాస లోకి..
బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తెలంగాణ భవన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో తెరాసలో చేరుతానని పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించారు. కౌశిక్ రెడ్డి తో పాటు నాయకులు పలువురు కార్యకర్తలు తెరాస లో చేరుతారని అయన తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో అభివృద్ధి చేసి చూపిస్తానని కౌశిక్ రెడ్డి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *