విషమంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్కుమార్ ఆరోగ్య ప్రరిస్థితి..!
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్కుమార్ యాదవ్ ఇటీవల మూడు చింతలపల్లిలో దళిత గిరిజన దండోరా దీక్షలో పాల్గొన్నారు.ఆ కార్యక్రమం అనంతరం అంజన్కుమార్ యాదవ్ కు జలుబు,జ్వరం లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్టులు చేయించుకున్నారు. కరోనా పరీక్షలు చేయించుకున్న అంజన్కుమార్ యాదవ్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దింతో అయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అంజన్కుమార్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అపోలో వైద్యులు వెల్లడించారు. దింతో అపోలో వైద్యులు అంజన్కుమార్ యాదవ్ కు వెంటిలేటర్పై చికిత్సను అందిస్తున్నారు. అంజన్కుమార్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి 48 గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేము అని అపోలో వైద్యులు వెల్లడించారు.