శోభన్ ను హీరోగా పరిచయం చేస్తూ రమేష్ గోపిల చిత్రం ప్రారంభం !

శోభన్ ను హీరోగా పరిచయం చేస్తూ రమేష్ గోపిల చిత్రం ప్రారంభం !

శోభన్ ను హీరోగా పరిచయం చేస్తూ రమేష్, గోపిల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాలుగో చిత్రం ఆదివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఎస్పీ క్రియేషన్ బ్యానర్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవంలో రచ్చ రవి, హీరో రామన్, విక్రమ్ , చంద్ర వట్టికూటి, మోహన్ , మధు పగడాల, డాక్టర్ కృష్ణమూర్తి, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సినిమా గురించి దర్శకులు వివరాలు తెలియచేస్తూ … మేము దర్శకత్వం వహిస్తున్న నాలుగో సినిమా ఇది. మేము ఇదివరకే హీరో తరుణ్ తో ఇది నా లవ్ స్టోరీ, ఆ తరువాత రెడ్డి గారింట్లో రౌడీయిజం తీసాము, అది విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ఈ మద్యే కన్నడలో ఓ సినిమా చేసాము, అది కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సో ఇది మా నాలుగో సినిమా. ఈ చిత్రం ద్వారా శోభన్ ను హీరోగా పరిచయం చేస్తూన్నాం, తాను ఇప్పటికే యాక్టింగ్, డాన్స్, ఫైటింగ్ లాంటి అంశాల్లో శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోతాడు. ఈ సినిమా లవ్, సస్పెన్సు ఎంటర్ టైనర్ గా ఉంటుంది. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ రోజు పూజ కార్యక్రమాలతో ప్రారంభించాం. లాక్ డౌన్ ఎత్తివేయగానే .. రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. ఈ చిత్రానికి సంబందించిన మిగతా నటీనటుల టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడిచేస్తాం. అన్నారు.

దర్శకత్వం : రమేష్ గోపి, బ్యానర్ : ఎస్పీ క్రియేషన్స్ ..
పిఆర్ ఓ : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు.

Leave a Reply

Your email address will not be published.