పులిమామిడిలో విద్యార్థుల ఇక్కట్లు.. ప్రమాదపు అంచున విద్యార్థుల బస్సు ప్రయాణం..

పులిమామిడిలో విద్యార్థుల ఇక్కట్లు.. ప్రమాదపు అంచున విద్యార్థుల బస్సు ప్రయాణం..

ఆర్.బి.ఎం పులిమామిడి: పులిమామిడి నుండి వికారాబాద్ కు వెళ్లే పాఠశాల, కళాశాలల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందుల్లో వికారాబాద్ కు చేరుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో విద్యార్థులు ఇండ్లకే పరిమితమైపోయారు కాగా ప్రస్తుతం విద్యాసంస్థలు అన్ని పునర్ ప్రారంభం అవ్వడంతో విద్యార్థులు బడి బాట పట్టారు. పులిమామిడి నుండి వికారాబాద్ వెళ్ళడానికి ఒకే బస్సు ఉన్నడంతో విద్యార్థులంతా ఒకే బస్సులో ప్రయనిస్తున్నారు.

బస్సులో కనీసం విద్యార్థులకు నిలబడటానికి కూడా స్థలం లేక ఫూట్ బోర్డింగ్ చేస్తు ప్రమాదపు అంచున వికారాబాద్ కు చేరుకుంటున్నారు. కాగా ఉన్న ఒక్క బస్సు సమయానికి రాక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో గ్రామానికి మరికొన్ని అదనపు బస్సులను విద్యార్థులకు అనుగుణంగా నడపాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్.టి.సి అధికారులను కోరుతున్నారు.

One Comment on “పులిమామిడిలో విద్యార్థుల ఇక్కట్లు.. ప్రమాదపు అంచున విద్యార్థుల బస్సు ప్రయాణం..”

  1. Hi.
    Yes it’s is correct, but if were lock down time not came the bus in vill-phulmamidi.i was suffer for students for not going for the schools & college . Now wards correct running for the bus in my village. So in my village running for nowards, please i will request requesting for the busdepo manger. Dm sir.
    Thank u

Leave a Reply to P. Anvesh Reddy Cancel reply

Your email address will not be published.